వరంగల్లోని కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం సురక్షా కా తిరంగా' కార్యక్రమంలో భాగంగా కేయూసీ పోలీస్ స్టేషన్ SHO ఆధ్వర్యంలో సైబర్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులకు ప్రస్తుత సైబర్ మోసాల పద్ధతులు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల అవగాహనను పరీక్షించడానికి సైబర్ సేఫ్టీ క్విజ్ కూడా నిర్వహించారు.