గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్గా టి. వెంకన్న తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంకన్న మాట్లాడుతూ, నగర సమగ్ర అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి వరంగల్ నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.