చాలా రోజుల తర్వాత మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పసుపు తరలివచ్చింది. ఈ సందర్భంగా క్వింటా పసుపునకు రూ.13,811 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మక్కలు బిల్టీ క్వింటా రూ.1,940 ధర పలికింది. ఎండల తీవ్రత కారణంగా హమాలీల విజ్ఞప్తి మేరకు ప్రతి బుధవారం మార్కెట్కు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ మూసివేయబడుతుంది.