వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేయగా, నలుగురు పిల్లలను కిడ్నాపర్ల చెర నుంచి రక్షించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో నరేశ్, వేల్పూరి ఉన్నారు. ఈ కిడ్నాప్ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.