హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. వరంగల్ భద్రకాళి గుడి దగ్గర గుడిసెలు వేసుకున్న పేదల ఇండ్లు, కార్యకర్తల షాపులు కూల్చివేత నీచ సంస్కృతి అని విమర్శించారు. అధికార బలంతో పోలీసులకు పోస్టింగ్ల ఆశ చూపి, తమ వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. నరేందర్ బాపుకు చేతులు జోడించి చెబుతున్నానని, ఆయన కొడుకు ఎమ్మెల్యే నాయిని కూల్చివేతలు చేసి నీతులు మాట్లాడుతున్నారని అన్నారు.