వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేనెటీగలు విధ్వంసం సృష్టించాయి. ధాన్యం ఆరబోస్తున్న మహిళలపై తేనెటీగలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో దేవేంద్ర అనే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లి కొనుగోలు కేంద్రంలో పడిపోవడంతో, నిర్వాహకులు ఆమెను అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.