వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎర్ర ప్రియాంక మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్గా, బండి జనార్దన్ వైస్ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది. నూతన పాలకవర్గం మార్కెట్ అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రైతులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.