గురువారం వరంగల్ జక్కలొద్దిలో దారుణం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం రాజకీయ అండతో ఓ నాయకుడి అనుచరులం అంటూ పలువురు గుడిసెలను తొలగిస్తున్నారు. గుడిసెల్లో ఉన్న సామాగ్రి మొత్తం బయట పడేసి, దాదాపు 50 గుడిసెలను దౌర్జన్యంగా తొలగించారు. ఎందుకు కూల్చుతున్నరాని అడిగిన వారిపై దాడి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. మామునూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.