రాజస్థాన్లోని అజ్మీర్లో స్కార్పియో వాహనంలో నలుగురు సజీవ దహనమైన ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రమాదం కాదని, పక్కా హత్యేనని పోలీసులు తేల్చారు. మాజీ సర్పంచ్ రామ్సింగ్, అతని రెండో భార్య, అత్త, మేనకోడలిని మొదటి భార్య సునీత హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. కుటుంబ గొడవలతో విసిగిపోయిన సునీత తన కుమారుడు, కుమార్తెతో కలిసి నలుగురి గొంతుకోసి హత్య చేసి, మృతదేహాలను స్కార్పియోలో పెట్టి తగలబెట్టినట్లు ఒప్పుకుంది. ఘటన అనంతరం ఏమీ తెలియనట్లు అంత్యక్రియల్లో గుండెలు బాదుకుంటూ ఆమె ఏడ్చిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.