TG: ఈగల్, హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్ తెలిపారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. దేశంలో చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను తీస్తామన్నారు. మరోవైపు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తున్నారని అన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.