TG: రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన SLPను సుప్రీం కొట్టివేసిన నేపథ్యంలో బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంటే భయపడే స్థాయికి ఉద్యన్ని ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 18న తలపెట్టే బంద్లో అందరూ పాల్గొనాలని, ఒక్క మెడికల్ షాపులు తప్ప అన్నీ బంద్ చేయాలని పిలుపునిచ్చారు. స్కూళ్లు, కాలేజీలు, పెట్రోల్ బంకులు, థియేటర్ల యాజమాన్యాలు కూడా బంద్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు.