TG: సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ వర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మే 10న ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి, రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారన్నారు. మహబూబ్నగర్లో రూ. 3,175 కోట్ల జాతీయ రహదారి పనులు, HYD పెట్రోలియం టెర్మినల్ను ప్రధాని ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.