సోషల్ మీడియాలో తిమింగలాల ప్రత్యేక ప్రోటీన్ వల్ల మనుషులు 200 ఏళ్లు బతకవచ్చనే వార్త వైరల్ అవుతోంది. అయితే, ప్రస్తుతానికి ఇది కేవలం పుకారు మాత్రమేనని సైన్స్ చెబుతోంది. బౌహెడ్ వేల్స్ 200 ఏళ్లు జీవించినా, వాటి ప్రోటీన్తో మనిషి ఆయుష్షు పెంచే పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. క్లిక్బైట్ హెడ్లైన్స్తో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయి. మనిషి గరిష్ట ఆయుష్షు 115-125 ఏళ్లు మాత్రమే. వందేళ్లు ఆరోగ్యంగా జీవించడానికి మంచి ఆహారం, వ్యాయామం, ప్రశాంత జీవనశైలి మాత్రమే అసలైన రహస్యాలు.