రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తరచుగా మారుస్తున్నారని, దీనివల్ల పాలనలో ఫలితాలు రావడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఐదు సార్లు భారీగా అధికారుల మార్పులు జరిగాయని ఆయన హైదరాబాద్లో మీడియాతో అన్నారు. విద్యుత్ శాఖలో రెండేళ్లలో ఐదుగురు అధికారులు మారారని, ఈ బదిలీలతో శాఖ అతలాకుతలం, అవినీతిమయం అయిందని ఆరోపించారు.