తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఈ వారం పెద్దగా మారలేదు. హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ కేజీ రూ.210–230, కామారెడ్డిలో రూ.230–240గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో రూ.250, గుంటూరులో రూ.260, భీమవరంలో రూ.230–250, ఏలూరులో రూ.230కి విక్రయిస్తున్నారు. మటన్ ధరలు ఎక్కువ ప్రాంతాల్లో రూ.800 పైగానే ఉన్నాయి.