ఆస్తి కోసం భర్తను దారుణంగా కొట్టిన భార్య!

48చూసినవారు
భర్తపై ఓ భార్య దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇటీవల చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సదరు మహిళ తన కుటుంబ ఆస్తిలో వాటా డిమాండ్ చేయడంతో.. ఆస్తిని పంచడానికి భర్త, ఆమె అత్త నిరాకరించారు. దీంతో ఈ వాదన తరువాత, ఆ మహిళ ఇంటి బయట స్పృహ కోల్పోయినట్లు నటించిందని కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం తనను కొట్టారని, నడవలేకపోతున్నానని సోదరుడితో చెప్పిందని, దీంతో అక్కడికివచ్చిన ఆమె సోదరుడు బావపై దాడి చేశాడన్నారు. ఈ క్రమంలో భార్య కూడా భర్తపై దాడి చేయడం గమనార్హం.

సంబంధిత పోస్ట్