కర్ణాటక జిల్లా పార్వతీనగర్కు చెందిన శరవణన్ (25), ముత్తులక్ష్మి (21) దంపతులు. నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్తులక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన సూర్య (23)తో పరిచయం ఏర్పడింది. అది శరవణన్కు తెలియడంతో భార్యతో తరచూ గొడవపడేవాడు. దాంతో భర్తను వదిలి సూర్యతో వెళ్లిపోయింది. బంధువులు ఆమెకు నచ్చజెప్పి భర్త దగ్గరికి చేర్చారు. దాంతో భర్తను చంపాలని ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి భర్తను కత్తులతో పొడిచి హత్య చేసి పరారయ్యారు.