
మద్యం మత్తులో అయ్యప్ప మాలధారునిపై కానిస్టేబుల్ దాడి (వీడియో)
AP: కాకినాడలో మద్యం మత్తులో అయ్యప్ప మాలధారునిపై ఓ కానిస్టేబుల్ దాడి చేశాడు. దీంతో అయ్యప్ప స్వాములు పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళన చేపట్టారు. అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ మాలధారునిపై దాడి చేయడమే కాకుండా చేయి కొరకడం అలాగే మేడలోని మాలను తెంపేసాడు. అతనికి బ్రీత్లైజర్ పరీక్ష నిర్వహించగా 262 యూనిట్లు చూపించింది.




