AP: మాజీ సీఎం వైఎస్ జగన్కు త్వరలో బిగ్ షాక్ తగలనుంది. సొంత ఖజానా నింపుకోవడం కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినవారంతా శిక్షార్హులేనని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో డెబిట్ లో పాల్గొన్న సత్యకుమార్ కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ను అరెస్ట్ చేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 'పాత్రధారులు అరెస్ట్ అవుతున్నారు. సూత్రధారుల వరకు వెళ్లాల్సి ఉంది. ఆధారాలు సేకరించిన తర్వాత మీ మాట తొందర్లోనే వాస్తవం కావచ్చు' అని తెలిపారు.