ఘజియాబాద్లోని మోడీనగర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వంట విషయంలో జరిగిన గొడవలో భార్య తన భర్త నాలుకను కొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్తను మీరట్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.