రైలు ప్రయాణంలో ఓ మహిళ చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. ఏసీ బోగీలో ఫోన్ ఛార్జింగ్ సాకెట్కు ఎలక్ట్రిక్ కెటిల్ను కనెక్ట్ చేసి, నీళ్లు పోసి మ్యాగీ తయారుచేసింది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. కొందరు సరదాగా స్పందిస్తుండగా, మరికొందరు ఇది ప్రమాదకరమని, రైలు విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం పడి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.