పంజాబ్కు చెందిన సరబ్జీత్ కౌర్ (52) అనే మహిళ గురునానక్ దేవ్ 555వ జయంతి సందర్భంగా నవంబర్ 4న లాహోర్ సమీపంలోని నాంకానా సాహిబ్ దర్శనానికి వెళ్లి మళ్లీ తిరగి రాలేదు. దీంతో అధికారులు విచారించగా.. ఆమె పాకిస్థాన్లో ఇస్లాం మతం స్వీకరించి స్థానిక యువకుడు నాసిర్ హుస్సేన్తో వివాహం చేసుకుంది. తన పేరు “నూర్”గా మార్చింది. 52 ఏళ్ల సరబ్జీత్ విడాకులు తీసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎగ్జిట్ క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు.