Top 10 viral news 🔥

రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో పీఎం కిసాన్ డబ్బులు!
దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ యోజన 21వ ఇన్స్టాల్మెంట్ నవంబర్ మొదటి వారంలో విడుదల కానుందని సమాచారం. ఈ మేరకు అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ కానుంది. అయితే e-KYC, ఆధార్ లింక్, బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ పూర్తి చేసినవారికే ఈ సాయం అందుతుంది. ఇప్పటికే పంజాబ్, హర్యానా, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాల్లో 21వ వాయిదా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీలైనంత త్వరగా నగదును జమ చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.




