యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూతన ఎస్సైగా శోభన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని, నేర రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.