యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 5.30 గంటలకు స్వామివారి కొండ కింద ప్రధాన వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.