
విద్యుత్ సమస్యలపై ప్రజా పాలన
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో ప్రజా పాలనలో భాగంగా విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు 10వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో పర్యటించారు. సిజిఎం బాలస్వామి, ఎస్సీ సురేష్ కుమార్, డీఈ వెంకటేశ్వర్లు సమస్యలను వెంటనే పరిష్కరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ప్రజల వద్దకే వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారని, ముఖ్యంగా విద్యుత్ వైర్లను చెట్లకు తగలకుండా తొలగించడం, లూజుగా ఉన్న వైర్లను సరిచేయడం వంటి పనులు జరిగాయని తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.






































