యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పశువైద్యశాల పరిధిలోని సబ్ సెంటర్ల డాక్టర్లు గొర్రెల మేకల కాపర్లకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహా కోరారు. సోమవారం ఆయన భువనగిరి మండలంలోని ముస్త్యాల పెల్లి, చీమల కొండూరు, రాయగిరి గొర్రెల మందలను సందర్శించి, కాపర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.