యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.