బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు తెలంగాణపై అవగాహన లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం
కాంగ్రెస్ పార్టీతోనే ఏర్పడిందని, ఢిల్లీ వేదికగా
బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నాడు ఏపీ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నప్పటికీ, సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ సాధించామని ఆయన పేర్కొన్నారు.