మాజీ మంత్రి కేటీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని 'చచ్చిన శవం'తో పోల్చుతూ, అది ఎంత ప్రయత్నించినా లేవదని సీఎం చెప్పారని చామల పేర్కొన్నారు.
కేసీఆర్ ఫామ్హౌస్లో,
కేటీఆర్ సోషల్ మీడియాలో ఉంటారని, కానీ పార్టీ నాయకులను మాత్రం రోడ్లపైకి వెళ్లి గత్తర చేయమని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.
కేటీఆర్ మాటలు నాయకుల బతుకులను ప్రజాభవన్ గేట్ల వద్ద కాపలాగా మారుస్తాయని చామల ట్విట్టర్లో విమర్శించారు.