యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల సిబ్బందికి ప్రతి నామినేషన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఇవాళ చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డిలతో కలిసి ఆయన నామినేషన్ల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమ్ ల పని విధానం ఎలా ఉందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.