యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పురం స్వామిరామానందతీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవ కాశాలున్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ చైర్మన్ కిషోర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్హతతో 2నెలల బేసిక్ కంప్యూటర్స్ కోర్సు, పదోతరగతి విద్యార్హతతో మూడున్నర నెలల ఆటోమొబైల్ సర్వీసింగ్ కోర్సు, సోలార్సస్టమ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.