యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం ‘ట్రినెక్సియా - 2026’ పేరుతో టెక్ ఫెస్ట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ, విద్యార్థులు ప్రపంచం గర్వించే గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేటి యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని, వారి ఆలోచనలు సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఉండాలని సూచించారు.