యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు.