దేవరకొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

1725చూసినవారు
దేవరకొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుడ్డ తండాకు చెందిన మూడవత్ రమేష్ అనే వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా, నియంత్రణ కోల్పోయిన డీసీఎం వాహనం ఆయనపైకి దూసుకువచ్చింది. ఈ దుర్ఘటనలో రమేష్ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్