Nov 18, 2025, 05:11 IST/
మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దంపతులు ఎన్కౌంటర్
Nov 18, 2025, 05:11 IST
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, ఆయన భార్య హేమ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. హిడ్మాపై దాదాపు కోటి వరకు రివార్డు ఉంది. అలాగే ఆయన భార్య హేమపై రూ.50 లక్షల రివార్డు ఉంది. హిడ్మాతో పాటు మరో నలుగురు కూడా మృతి చెందారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.