యూపీలోని మొరాదాబాద్ భోజ్పూర్ PS పరిధిలో దారుణ ఘటన జరిగింది. కారులో ప్రయాణికులను మార్చే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఆరుగురు దుండగులు కలిసి ఒక యువకుడిని బెల్టులతో ఘోరంగా కొట్టారు. ఆ యువకుడు ప్రాధేయపడినా వదలకుండా హింసించారు. దుండగుల పట్టు నుండి తప్పించుకుని అతను రోడ్డుపై పరుగెత్తినప్పటికీ, వెంబడించి మరీ మళ్లీ విచక్షణారహితంగా దాడి చేశారు.