TG: మంచి ఉద్యోగం రావడంలేదని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రూపని అఖిల్(24) బీటెక్ పూర్తి చేసి, ఏడాదిన్నర క్రితం HYDలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తక్కువ జీతం వస్తుండడంతో ఊరికి తిరిగొచ్చిన అఖిల్ మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగం రాక నిరాశతో చిట్యాలలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.