ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోడి మాంసం దుకాణంలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోజువారీ పనిలో భాగంగా అతను పనిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.