మహిళా కానిస్టేబుల్పై ఓ యువతి దాడికి దిగిన ఘటన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో చోటుచేసుకుంది.
డెహ్రాడూన్ పల్తాన్ బజార్లోని ఆభరణాల దుకాణం నుంచి ఓ యువతి బంగారు ఉంగరాలను దొంగిలిస్తూ పట్టుబడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆమె వద్ద నుంచి ఉంగరాలు తీసుకుంటున్న క్రమంలో మహిళా కానిస్టేబుల్పై దాడికి దిగింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.