TG: హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నాగోల్కు చెందిన రోజా రమణి (26)గా పోలీసులు గుర్తించారు. మాదాపూర్లోని ఓ హాస్పిటల్లో అకౌంటెంట్గా పని చేస్తుందని తెలిపారు. తమ కూతురు రోజా కనబడడం లేదంటూ నాగోల్ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కాగా బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్స్ వేధింపులు తాళలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.