ఆన్లైన్ లోన్ యాప్ల నిర్వాహకుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లా రామయంపేటకు చెందిన శ్రీశైలం అనే యువకుడు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఆన్లైన్ లోన్ యాప్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.