AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఓ మద్యం షాపు పర్మిట్ రూమ్లో యువకుడు మృతి చెందాడు. మృతుడు అప్పారావుపేటలోని పోతులప్ప గుడి వీధికి చెందిన దొడ్డం నరేశ్ (29)గా గుర్తించారు. మద్యం కొనుగోలు చేసిన నరేశ్ పక్కనున్న పర్మిట్ రూమ్లోకి వెళ్లి తాగుతూ అక్కడే పడి అపస్మార స్థితిలోకి వెళ్లాడు. అతిగా మద్యం తాగి మరణించినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.